Friday, May 3, 2024

ఝార్ఖండ్‌లో రూ.10 అడిగాడని కుమారుడిని చంపిన తండ్రి

spot_img

ఝార్ఖండ్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుమారుడిని చంపేశాడు. ఛత్రాజిల్లాలో రూ.10 అడిగినందుకు గొంతు నులిమి చంపేశాడు. బీలేశ్ భూయాన్(48) తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు యాదవ్‌ తో కలిసి వశిష్టనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. నిన్న(సోమవారం) భార్యభర్తలు ఫుల్ గా తాగి గొడవపడ్డారు. అదే సమయంలో పప్పు యాదవ్ 10 రూపాయలు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు.

అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భూయాన్ విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. అదే సమయంలో వారి కుమార్తె ఇసుక బట్టిలో తన పని ముగించుకుని ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చాక తండ్రి చేసిన ఘోరం గురించి తెలిసి భయంతో పెద్దపెట్టున కేకలు వేసింది. దీంతో అలర్టైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles