Friday, May 3, 2024

బండి బండారం బయటపెట్టిన కేటీఆర్

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఆరు నెలల్లో ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు కేటీఆర్. నేడు తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ తో కలుస్తామంటున్నాడు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ని బీజేపీ ఓడిస్తుందని.. తమతో కాంగ్రెస్ కలిసిరావాలని బండి సంజయ్ బహిరంగంగా మాట్లాడటంపై ఫైర్ అయ్యాడు కేటీఆర్.

బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో అదానీని తిడతారు.. మరి తెలంగాణలో ఏమో ఎందుకు అదానితో కలిసి పనిచేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల సంఖ్యని అనునిత్యం తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9వ సోనియమ్మ పుట్టినరోజున తేదీన రైతు రుణమాఫీ ఇస్తామని రేవంత్ చెప్పారుగా..దాని గురించి కూడా ముఖ్యమంత్రికి గుర్తుచేయాలి. రైతుబంధు 10,000 కాదు, 15000 ఇస్తాం.. పెన్షన్ 2వేలు కాదు.. 4వేలు ఇస్తాం అన్న కాంగ్రెస్ హామీలని ప్రశ్నించాలని కార్యకర్తలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

Latest News

More Articles