Wednesday, May 1, 2024

భారత దేశ చరిత్రలోనే ఇదొక విప్లవం

spot_img

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్నిపేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే తెలంగాణ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నేడు ప్రగతి భవన్ నుండి ఏకకాలంలో 9మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. శుక్రవారం శుభముహూర్తాన సిఎం కేసీఆర్ చేతులమీదుగా 9 మెడికల్ కాలేజీలు ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభమయ్యాయి. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రసంగించారు. సిఎం కేసీఆర్ గారి సందేశం తో సమావేశం ముగిసింది.

ఈ సందర్భంగా కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం…జిల్లాల్లో నేటి నుండి నూతన మెడికల్ కాలేజీలు నూతనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో…వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సిఎం వోఎస్డీ డా. గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ ఎం ఐ డీసీ ఎం.డీ, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీలు దామెదర్ రావు, రాములు,కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధునూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు విప్ రేగాకాంతారావు, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles