Friday, May 10, 2024

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

spot_img

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్‌చెరు పట్టణంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు.

184 కోట్లతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. పటాన్‌చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పటాన్‌చెరు పట్టణంలోని 150 అడుగుల ఎత్తైన జెండాస్తంభంపై జాతీయ జెండాను ఎగురవేసిన ముఖ్యమంత్రి పటాన్‌చెరులో ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని కూడా ప్రారంభిస్తారు.

Latest News

More Articles