చుట్టాలింటికొచ్చి ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో జరిగింది. కర్మన్ ఘాట్లో నివాసం ఉండే రాకేష్ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాడు. అయితే రాకేష్.. గురువారం మొయినాబాద్ పరిధిలోని స్టార్ కాలనీలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ నిన్న రాత్రి అందరితో కలిసి భోజనం చేసి కలివిడిగా ఉన్నాడు. అందరూ పడుకున్న తర్వాత తెల్లవారుజామున గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. ఉదయాన్నే గమనించిన బంధువులు కిందికి దింపి చూసే సరికి చనిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. మొయినాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: సెక్రటేరియట్ ముందు బైక్ విన్యాసాలు.. వీడియో వైరల్