రైతు బంధు నిధులను పాత బకాయిల కింద జమ చేసుకోవటంపై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేసిన రైతు బంధు డబ్బులను కొంతమంది బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. ఈ విషయం ఆర్థిక మంత్రి హరీష్ రావు దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని మంత్రి కోరారు. రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు జమ చేసుకోరాదని మంత్రి స్పష్టం చేశారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ) నిబంధనలను బ్యాంకర్లు అందరూ విధిగా పాటించాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని బ్యాంకులు ఎస్ఎల్బీసీ నిబంధనల పాటించాలన్నారు.