Thursday, May 2, 2024

అమెరికాలో బుబోనిక్ ప్లేగు తొలికేసు నమోదు..!!

spot_img

అమెరికాలో ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు సోకింది. అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి కేసు నమోదు అయ్యింది. ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు సోకినట్లు అధికారులు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందంటున్నారు. బుబోనిక్ ప్లేగు వల్ల ఒక్కప్పుడు యూరోప్ లో భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరప్ లో సోకిన ఆ ప్లేగు వల్ల సుమారు 3వ వంతు జనాభా మరణించింది.

దీన్ని బ్లాక్ డెత్ గా పేర్కొంటున్నారు. ఓరేగాన్ లోని డిసెచూట్స్ కౌంటీలో తాజాగా కేసును గుర్తించారు. అతనికి ట్రీట్ మెంట్ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. బాధితుడి సమీపంలో ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు.

జంతువు నుంచి ప్లేగు వైరస్ సోకిన 8రోజుల తర్వాత మనిషిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెప్పారు. జ్వరం, బలహీనత, చలి, ఒళ్లు నొప్పులు ఆ క్షణాల్లో ఉన్నాయి. ప్రాథమిక దశలో బుబోనిక్ ప్లేగును గుర్తించి చికిత్స అందించాలి.

లేదంటే అది సెప్టిసెమిక్ ప్లేగ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ అవుతుంది. అది ఊపిరితిత్తులను దెబ్బతిస్తుంది. 14వ శతాబ్దంలో యూరోప్ లో వచ్చిన ఆ వ్యాధి వల్ల ఐదు కోట్ల మంది బలయ్యారు. అయితే ఓరేగావ్ లో నమోదు అయిన కేసు అత్యంత అరుదైనదన్నారు. ఆ రాష్ట్రంలో చివరిసారి 2015లో ఆ కేసు నమోదయ్యింది.

ఇది కూడా  చదవండి: బంపర్ ఆఫర్..ఐఫోన్ 14 ప్లస్‌పై రూ. 30 వేల భారీ తగ్గింపు..!!

Latest News

More Articles