Sunday, April 28, 2024

ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. 99.86 శాతం పోలింగ్‌ నమోదు

spot_img

ఇవాళ(గురువారం)మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూలు,నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది.

ఏప్రిల్‌ 2వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తిలో ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ నవీన్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో గుండెపోటుతో తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

Latest News

More Articles