Saturday, April 27, 2024

అమెరికాలో గుండెపోటుతో తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

spot_img

ఏజ్ తో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చిట్టోజు మహేష్ అనే యువకుడికి 34 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. హార్ట్ ఎటాక్ కారణంగా నిన్న(బుధవారం) మరణించాడు. అతడు తెలంగాణలోని జనగాం జిల్లాలోని బచ్చన్న పేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్ గ్రామ వాసి.

చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ ఇంజనీరింగ్ చదివి‌ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగం అక్కడకు వెళ్లాడు. కొడుకు విదేశాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు. కానీ ఆ ఆనందం ఎంత కాలం మిగలలేదు.

ప్రస్తుతం జార్జియాలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడుమహేష్. అతడికి భార్య , నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న జీవితంలోకి మాయదారిలా దాపురించింది గుండె పోటు. యధావిధిగా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం) ఉద్యోగానికి వెళ్లాడు. డ్యూటీలో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే గుండె పోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన మహేష్.. ఇలా విగతజీవిగా మారే సరికి కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అతడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ మృతదేహం స్వగ్రామం రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీ నేత బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Latest News

More Articles