Wednesday, May 1, 2024

బీసీల సంక్షేమం, అభివృద్ధికి ప్ర‌భుత్వం నిరంతర కృషి

spot_img

బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే ప్రభుత్వం తమదన్నారు మంత్రి గంగుల కమలాకర్. హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్‌ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

బీసీలు వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారన్నారు మంత్రి గంగుల కమలాకర్. కల్యాణ లక్ష్మి రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు. బీసీలతో పాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి సీఎం కేసీఆర్ ఎనలేని సేవ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. అభివృద్ధి కోసం నీరా కేఫ్‌ ను ప్రారంభించడంతో పాటు గౌడబీమాను ప్రకటించారని చెప్పారు. కల్లుగీత వృత్తిదారుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన పల్లె రవికుమార్‌కు అవకాశం కల్పించారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గౌడ వృత్తిదారులందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని తెలిపారు మంత్రి గంగుల.

Latest News

More Articles