మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఇవాళ (శుక్రవారం) తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయ భూమిపూజకు రావాల్సిందిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిని వారు ఆహ్వానించారు.
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో నిర్మించే అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం, తదితర అంశాలను వారు ఆయలంలో పరిశీలించారు.