Thursday, May 9, 2024

ఈ నెల 14 నుండి 24 వరకు గాంధీ చిత్ర ప్రదర్శన

spot_img

ఈ నెల 14 నుండి 24వ తేదీ వరకు గాంధీ చిత్ర ప్రదర్శన చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఆఫ్ కామర్స్ చాంబర్స్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, వివిధ శాఖల అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించనున్నాం. వజ్రోత్సవాల ప్రారంభంలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాం. విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించింది. అందుకే విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంచే విధంగా 582 స్క్రీన్‎లపై గాంధీ చిత్రప్రదర్శన చేయబోతున్నాం. విద్యార్ధులను థియేటర్ల వద్దకు తీసుకొచ్చి, క్షేమంగా తీసుకెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం’ అని మంత్రి తలసాని సూచించారు.

Latest News

More Articles