సూర్యపేట జిల్లా: కల్యాణ లక్ష్మీ , షాదీముబారక్ పథకాల ద్వారా అడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రాల్లో 90 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా,సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారికి కల్యాణ లక్ష్మీ పథకం అమలు చేస్తున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్ పథకాలు వచ్చిన తర్వాత బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిందని తెలిపారు.