Sunday, April 28, 2024

YS, చంద్రబాబులనే గడగడలాడించారు కేసీఆర్.. ఈ పిల్ల కాకులు ఎంత ?

spot_img

సూర్యపేట జిల్లా కోదాడలో జరిగిన BRS నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. MP లింగయ్య యాదవ్, మాజీ MLA మల్లయ్య యాదవ్ లు హాజరైన ఈ సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని తెలంగాణ లో కేసీఆర్ గారు చేసి చూపించారు. కానీ BRS పార్టీ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కొరవడింది. అందుకే పార్టీ కొంత నష్టపోయింది. అదే లోపం అయింది. అదే సమయంలో 420 నేచర్ తో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టారు. కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట్ట ముంచారు. కాంగ్రెస్ అంటేనే అక్రమ వసూళ్లు, దాడులు. పదేళ్ల కాలంలో BRS నాయకులు పోలీసులను ఏనాడు వాడుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. రైతు బంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొడతాం అని బెదిరిస్తున్నారు.

రైతు బంధు ఆగిపోయింది. అన్నదాతలను చెప్పుతో కొట్టమన్న కాంగ్రెస్ వాళ్ళను రేపటి పార్లమెంట్ ఎన్నికలో చెప్పులతో కొట్టాలి. బుద్ధి చెప్పాలి. సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 సార్లు నీరు అందించిన ఘనత BRS ది.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నీళ్లు పోయాయి . కరంట్ పోతుంది. గులాబీ కార్యకర్తలకు పోరాటం కొత్త కాదు. చంద్రబాబు ,YS లను గడగడలాడించి తెలంగాణ తెచ్చారు కేసీఆర్ గారు. గులాబీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండదు. BRS ని ఏమి చేయలేరు మీరు. కాంగ్రెస్ కుట్రలను ఎన్నింటినో చూసాం. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు కాంగ్రెస్ వాళ్లు. పిల్ల కాకులు వీళ్ళు. సోయి ,బాధ్యత లేదు కాంగ్రెస్ వాళ్లకు. కాంగ్రెస్ వాళ్లు దొంగల్లాగా వచ్చి పడ్డారు. పాలన చేతకాకపోతే అధికారం వదిలి పెట్టిపోండి..కాంగ్రెస్ చేతకాని తనం వల్ల నల్గొండ ఎడారి అవుతుంది కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేశారు కాంగ్రెస్ దద్దమ్మలు. పదేళ్లు కేంద్రం ఒత్తిడి చేసినా కేసీఆర్ గారు తలొగ్గలేదు. అప్పట్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశారు. కానీ కేసీఆర్ గారు సరైన బుద్ధి చెప్పారు…

Latest News

More Articles