Thursday, May 2, 2024

బోధన్ హాస్టల్ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం

spot_img

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన వెంకట్ బోధన్ హాస్టల్ లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం వలన జరిగిన చిన్న సంఘటనలో ఒకరు చనిపోవడం..8మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైంది. మర్డర్ కేసు నమోదు కావడంతో ఆ 8మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపు లేని చర్యల వల్లనే ఈ దారుణం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఅర్ పై పడి ఎడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూసామంటే .. మళ్ళీ గత మూడు నెలల్లో చూసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలల్లో వాచ్ మెన్ లేకపోతే.. ఒక పోలీస్ కానిస్టేబుల్ ని నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరామన్నారు ఎమ్మెల్సీ కవిత. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: నిన్నటి సభతో కాంగ్రెస్, బీజేపీ నేతల రహస్య ఒప్పందం బయట పడింది

Latest News

More Articles