Saturday, April 27, 2024

బిల్కిస్ బానో కేసు తీర్పును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత

spot_img

హైదరాబాద్: బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు కవిత తన “ఎక్స్” ఖాతాలో స్పందించారు.

మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని కవిత అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.

కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Latest News

More Articles