రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2018లో నమోదైన 8 కేసుల్లో 6 కేసులను కొట్టేస్తున్నట్లు నాంపల్లి కోర్టు ప్రకటించింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కొట్టేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని తెలిపింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించిన అధికారులు.. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిళ్లుగా తీసుకున్నారు. ఆ శాంపిల్స్ను అధికారులు ఎఫ్ఎస్ఎల్కు పంపించగా.. డ్రగ్స్ ఆనవాళ్లు ఏంలేవని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కేసులను కొట్టేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.