సినీఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులు అలియా భట్, దీపికా, కత్రినా, కరీనా కపూర్, సమంత తదితరులు తాము నటిస్తున్న సినిమాల కంటే కొన్ని నిమిషాల నిడివి ఉన్న వాణిజ్య ప్రకటనలకు కోట్లలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు.అయితే వీరందరి కంటే ఎక్కువ సంపాదిస్తున్న నటి ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు తమిళ లేడీ సూపర్స్టార్గా పిలుచుకునే నయనతార.భారతీయ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఓ ప్రకటనలో నటించినందుకు గాను 5 కోట్ల పారితోషికం అందుకుంది. నయనతార టాప్ స్టార్ నటి అనడానికి ఇదో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు.
నయన్ పార్ట్ టైమ్ మోడల్, టీవీ యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించి..ఈరోజు సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. దాదాపు 20 ఏళ్లకు పైగా సౌత్ ఇండియన్ సినిమాలో ఓ వెలుగు వెలిగిన నయనతార.. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లో తన సత్తా చాటింది.నయనతార వెండితెరను దాటి ఇప్పుడు ప్రకటనల రంగాన్ని కూడా శాసిస్తోంది. ఇటీవలి నివేదికల ప్రకారం, టాటా స్కైతో ఒప్పందం కుదుర్చుకున్న నయనతార, బహుళ భాషలలో రెండు రోజుల ప్రచార చిత్రంలో నటించడానికి రూ. 5 కోట్లు తీసుకుందట. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ యాడ్ భారతదేశంలోని బహుభాషా ప్రేక్షకులలో సూపర్ హిట్ అయింది.ఇక ఒక్కో సినిమాకి 10 కోట్లు సంపాదిస్తున్న నటీమణుల జాబితాలో నయనతార అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: కాముడిని కాల్చే సంప్రదాయం ఎలా మొదలైంది? దాని పౌరాణిక కథ ఏంటో తెలుసా?