Sunday, April 28, 2024

ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను కలిసిన కుటుంబీకులు..!

spot_img

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో భర్త అనిల్ సహా ఇతర కుటుంబ సభ్యులు కలిసారు. వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయ పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. కవిత నివాసంలో సోదాల సమయంలో ఈడీ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిలో రెండు కవితవి ఉండగా..మిగతావి ఆమె వ్యక్తిగత సహాయకులవి ఉన్నట్లు సమాచారం.

కాగా కవితను విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈడీ అధికారులు నేడు తొలిరోజు విచారించారు. 7 రోజులు పాటు విచారణ కొనసాగునున్నట్లు సమాచారం. ఇక కవితకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారు. కవితను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో పాటు కవిత సన్నిహితులుకూడా కలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఆ యాడ్‎కు లేడీ సూపర్‎స్టార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Latest News

More Articles