Friday, May 10, 2024

మియాపూర్ లో చెడ్డీ గ్యాంగ్ కలకలం.!

spot_img

భాగ్యనగరంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా దోపిడి దొంగల కదలికలతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. హఫీజ్ పేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో శనివారం అర్థరాత్రి కొందరు దుండగులు చోరికి యత్నించారు. చెడ్డీలు ధరించి మారణాయుధాలతో వచ్చారు. వీరు స్కూల్ కార్యాలయంలోని కౌంటర్ లో రూ. 7. 85లక్షల నగదును దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన ద్రుశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను కలిసిన కుటుంబీకులు..!

Latest News

More Articles