Sunday, April 28, 2024

రికార్డ్ సృష్టించిన అన్నగారి నాణేలు

spot_img

భారతదేశంలో ప్రముఖుల పేరిట స్మారక నాణేలు విడుదల చేయడం 1964 నుంచి కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు అనేక మంది మహనీయుల ముఖచిత్రాలతో స్మారక నాణేలు విడుదల చేశారు. తాజాగా తెలుగు ప్రజల అన్నగారు, అభిమాన నటుడు ఎన్టీఆర్ స్మారక చిహ్నం కూడా విడుదల చేశారు. అయితే గతంలో విడుదలైన స్మారక నాణేల కన్నా మించి ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాల పరంగా రికార్డు సృష్టించింది.

ఆగస్టు 28న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేశారు. అప్పటినుంచి ఈ నాణేన్ని హైదరాబాద్‎లోని మింట్ కాంపౌండ్‎లో ముద్రిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు అమ్ముడయ్యాయి. భారత్‎లో ఇంతవరకు ఇదే రికార్డు అని హైదరాబాద్ మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. గతంలో ఈ రికార్డు 12 వేల అమ్మకాలతో ఉండగా… ఇప్పుడు అంతకు రెండింతల అమ్మకాలతో ఎన్టీఆర్ స్మారక నాణేలు రికార్డు నెలకొల్పాయని తెలిపారు.

Latest News

More Articles