Tuesday, May 7, 2024

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో రూ.340 కోట్లు స్వాధీనం

spot_img

మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్‌ అమలులోకి వచ్చిన అక్టోబర్‌ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీనం చేసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుపమ్‌ రాజన్‌ శుక్రవారం వెల్లడించారు.

Read Also: ఫ్యాక్టరీలో దూరిన 15 అడుగుల కింగ్ కోబ్రా.. భయపెడుతున్న వీడియో

వీటిలో రూ.40.18 కోట్ల నగదు, రూ.17 కోట్ల విలువైన నార్కోటిక్‌ డ్రగ్స్‌, రూ.280 కోట్ల విలువైన మద్యం, నగలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. 2018 ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ.72.93 కోట్ల కన్నా ఇది సుమారు ఐదు రెట్లు అధికమని చెప్పారు.

Latest News

More Articles