Sunday, April 28, 2024

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి దూకి మహిళ ఆత్మహత్య

spot_img

హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వాసి మారెమ్మ (70) గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆ మహిళ సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Latest News

More Articles