Thursday, May 2, 2024

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: రియాక్టర్ పేలి ఐదుగురి మృతి

spot_img

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ సమీపంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో మంటలు చెలరేగి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఆ పరిశ్రమ డైరెక్టర్ రవి కూడా ఉన్నారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కంపెనీ ఎదుట మృతుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమలో మరో రియాక్టర్‌కు  కూడా మంటలు వ్యాపించాయి. అది కూడా పేలే చాన్స్  ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను హుటాహుటిన పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవద్దు: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు

Latest News

More Articles