ఖమ్మం జిల్లా వైరాలో దారుణ ఘటన జరిగింది. రోడ్డుపై వేచియున్న వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని నిలువు దోపిడీకి పాల్పడ్డారు అగంతకులు. అనంతరం వారిని తల్లాడ దగ్గర్లో దింపి పరారయ్యారు. వృద్ధ దంపతుల వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, రూ.5 వేలను దోచుకున్నారు దుండగులు. తల్లాడ పోలీస్ స్టేషన్ లో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.