న్యూఢిల్లీ: తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఈరోజు విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు పేర్కొంది. తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయని తెలిపింది.మొత్తం ఓట్లలో మహిళా ఓటర్లు 1,58,43,339 మంది, పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నారు.
Also Read.. ప్రపంచ కప్ చరిత్ర: భారత టాప్ 10 బ్యాటర్లు, వికెట్ టేకర్స్ గురించి తెలుసా?
ఇంకా ట్రాన్స్జెండర్లు 2,557 మంది, సర్వీస్ ఓటర్లు 15,338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో వెల్లడించారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల బృందం ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తుంది. వారి మూడు రోజుల పర్యటన రేపటితో ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.