నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తత నెలకొన్నది.నిన్న( బుధవారం) అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతోంది. అయితే, సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీఎస్పీ పోలీసులను మోహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు దగ్గర ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్లో మొత్తం 26 గేట్లు ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో దాదాపు 700మంది పోలీసులు సాగర్ డ్యామ్పైకి చేరుకోగా.. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.
ఇది కూడా చదవండి: స్మితా సబర్వాల్కు సాగునీటి పారుదలశాఖ బాధ్యతలు