న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 వేలం ప్రక్రియను డిసెంబర్ 19న నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ దుబాయ్ వేదికగా జరుగనుంది.
ఐపీఎల్ ఆక్షన్ను ఈ నెల 19న నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. గత నెలలో ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 1,166 మంది ఆటగాళ్లు వేలంలో రిజిష్టర్ చేసుకున్నారు. వేలానికి పేరు నమోదు చేసుకున్నవారిలో 830 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 336 మంది ఓవర్సీస్ ప్లేయర్లున్నారు.