హైదరాబాద్ : అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురును మృత్యువు కబలించడంతో ఓ తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఖైరతాబాద్లో చేటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరాతాబాద్కు చెందిన కిశోర్ ఐదేళ్ల కూతురు ఆరాధ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. ఎంతో అపురూపంగా పెంచుకున్న చిట్టితల్లి మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి కిశోర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.