Thursday, May 2, 2024

నరేంద్ర మోడీపై నాగ్‌పూర్‌లో అంత ద్వేషమా!

spot_img

మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉన్న బ్యానర్‌పై పలుమార్లు ఒక వ్యక్తి రాయి విసిరాడు. అక్కడున్న స్థానికులు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు మొబైల్‌లో రికార్డ్‌ చేసారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల వ్యక్తి స్థానిక బస్టాంప్‌ వద్ద ప్రధాని మోదీ బ్యానర్‌ను చూసి, ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతిలో రాయి తీసుకుని బ్యానర్‌పై ఉన్న మోదీ ఫొటోపై పలు మార్లు రాయిని విసిరాడు. స్థానికులు అక్కడ గుమిగూడి దీనిని చూశారు. కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసారు. గుజరాత్ కాంగ్రెస్ నేత హితేంద్ర పితాడియా ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘నరేంద్ర మోడీపై నాగ్‌పూర్‌లో అంత ద్వేషమా!’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest News

More Articles