రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద దాదాపు 150 కిలోల నుండి 200 కిలోల వరకు పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
స్కోడా కార్ లో ముగ్గురు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్న సమాచారాన్ని ఎస్.వో.టీ పోలీసులకు పక్క సమాచారం రావడంతో వెంబడించి పట్టుకున్నారు. దీనిని అరకు నుండి నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు సమాచారం.
ఔటర్ రింగ్ రోడ్ హిమాయత్ సాగర్ వద్ద వెంబడించి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్కోడా కారును ఆపి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.