ఉద్యాన డిప్లమా అప్లికేషన్ల స్వీకరణను పొడగించింది శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం. ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉద్యాన డిప్లమాలో చేరేందుకు విద్యార్థుల నుండి అప్లికేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీని జూలై 14 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో రెండు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ లు.. మరో రెండు ప్రైవేట్ ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి. ప్రతీ కాలేజీలో 40 మంది విద్యార్థులకు ప్రతీ ఏడాది ప్రవేశం కల్పిస్తున్నారు.