పాట్నా : బీహార్లోని దనపూర్ కోర్టులో దారుణ ఘటన జరిగింది. అండర్ ట్రయల్ ఖైదీ అభిషేక్ కుమార్ ను ఇద్దరు దుండగులు కాల్చి చంపడం కలకలం సృష్టించింది. ఖైదీని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇక కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పాట్నా సిటీ ఎస్పీ రాజేశ్ కుమార్ తెలిపారు.
#WATCH | Assailants shot dead an undertrial prisoner brought by police to Patna's Danapur court today. Two accused arrested pic.twitter.com/WLoMVmSqJh
— ANI (@ANI) December 15, 2023