ఇవాళ(మంగళవారం) ఉదయం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్త జన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవము వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ సహా ఎవరు వచ్చినా ఖమ్మంలో ఎదుర్కొంటా