Sunday, April 28, 2024

గారాలపట్టి వామికతో విరాట్ కోహ్లీ ఫొటో వైరల్..!!

spot_img

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ..స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్ లో ఉన్నారు. తాజాగా కోహ్లీ తన కుమార్తె వామికను తీసుకుని లండన్ లో ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ టేబుల్ మీద వామిక భోజనం చేస్తుండగా..తన పక్కన కోహ్లీ కూర్చున్నాడు. అయితే తమ పిల్లల విషయంలో చాలా గోప్యత పాటించాలనుకుంటున్నట్లు కోహ్లీ గతంలోనే తెలిపారు. తన కుమార్తె ఫొటోలు తీయోద్దని ఆ మధ్య మీడియాను కూడా కోరాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ తన నిర్ణయాన్ని గౌరవిస్తూ తాజాగా వైరల్ అయిన ఫొటో లో కొందరు అభిమానులు వామిక ముఖంపై ఎమోజీని ఉంచి పోస్టు చేశారు.

కాగా ఈనెల ఫిబ్రవరి 15న లండన్ లోని ఓ ఆసుపత్రిలో అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మించింది. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. తమ బాబుకు అకాయ్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమైన విరాట్..త్వరలో జరగబోయే ఐపీఎల్ ఆడుతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

ఇది కూడా చదవండి: విషాదం..ఉదోగ్యం పోతోందనే భయంతో పేటీఎం ఎంప్లాయ్ సూసైడ్.!

Latest News

More Articles