Sunday, April 28, 2024

గాజాలో అన్నార్తుల‌పై కాల్పులు: 20 మంది మృతి, 155 మందికి గాయాలు

spot_img

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి కేంద్రంగా మారిన గాజాలో దారుణమైన పరిస్థితిలు నెలకొన్నాయి. ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ  కాల్పుల్లో 20 మంది మ‌ర‌ణించారు.. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజాలోని అల్‌ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు తెలిపారు.

గాయపడి ఆసుపత్రికి వస్తున్నవారికి వైద్యం అందించడం సాధ్యం కావడం లేదని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరైన వసతులు,మెడిసిన్లు లేవన్నారు. ఈ అన్నార్తుల‌పై యుద్ధ ట్యాంకు, శక్తిమంతమైన తుపాకులతో ఇజ్రాయెల్‌ సైనికులు దాడి చేసి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 29న సైతం గాజాలో ఇదే తరహాలో దాడి జరిగింది. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపటంతో పాటు కాల్పులకు దిగడంతో 104 మంది మృతి చెందారు. 760 మంది గాయపడ్డారు. మొదట వైమానిక దాడి జరిపిన ఇజ్రాయెల్‌ సైన్యం ఆ తర్వాత ట్రక్కుల దగ్గర ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రేపే సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్..

Latest News

More Articles