Thursday, May 2, 2024

దేశవ్యాప్తంగా 4423 కరోనా పాజిటివ్ కేసులు

spot_img

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760  కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో కేరళ, కర్ణాటకలో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు మృతి చెందారు. ఇది ఇలా ఉంటే… దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి కోవిడ్-19 సోకింది. వీరిలో 5.3 లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు దేశంలో 98.81 శాతం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: కూతురి పెళ్లిలో మాజీ భార్యకు కిస్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

Latest News

More Articles