ఎదుటువారికి సహాయ పడటంలో ఎప్పుడు ముందుండే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (BB Patil) మరోసారి తన మంచితనాన్ని చాటిచెప్పారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి పై డాకుర్(Dakur) గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది.
అదే ఆ మార్గం గుండా వెళ్తున్న ఎంపీ వెంటనే తన వాహనాన్ని పక్కకు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే అంబులెన్సును పిలిపించి సమీపంలోని దవాఖానకు తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.