Thursday, May 2, 2024

అస్వస్థతతో స్నేహ మృతి

spot_img

భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్ లోని తన ఎన్‌క్లోజర్‌లో 14 ఏళ్ల తెల్ల ఆడపులి స్నేహ ఇవాళ(శుక్రవారం) చనిపోయింది. ఈ విషయాన్ని జూ అధికారులు కన్ఫాం చేశారు. తెల్ల ఆడపులి గురువారం అస్వస్థతకు గురి కాగా వైద్య చికిత్స అందిస్తున్నారు. దానికి స్లైన్, మందులు ఇచ్చారు. కాని అది శుక్రవారం మరణించింది. తెల్ల ఆడపులి వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో పాటు తీవ్ర ఉష్ణోగ్రత వల్ల బాధ పడుతోందని అధికారులు తెలిపారు.

రాయల్ బెంగాల్ టైగర్ నిషాన్‌కు, తెల్ల ఆడపులి కుసుమ్‌కు 2010 మార్చి 1న స్నేహ జన్మించింది. స్నేహ 2016 ఆగస్టు 5న మౌసుమి (ఆడ),చిను (మగ), విక్కీ (మగ) పిల్లలకు, రెండవ సారి గర్భం దాల్చినప్పుడు లవ్, కుశ్‌లకు జన్మ ఇచ్చింది. 2021 మార్చి 28న అది మూడు మగ పిల్లలు రాకేష్, రాకీ, బన్శీలకు జన్మ ఇచ్చింది. జూలో గతేడాది జూలై వరకు 27 పులులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: నల్లగొండ జిల్లాను ఏడారిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది

Latest News

More Articles