Sunday, April 28, 2024

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

spot_img

ఏపీ: క్రికెట్‌ ఆడుతూ ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో చోటుచేసుకున్నది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవనగర్‌ కాలనీకి చెందిన మహేంద్ర(22) ఆదివారం మధ్యాహ్నం కాలనీ సమీపంలో తోటి యువకులతో క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడు.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహేంద్ర గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Latest News

More Articles