Friday, May 10, 2024

అరగంట వ్యవధిలో హైదరాబాద్‌, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో చోరీ

spot_img

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడీకి తెగబడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో తొలుత చోరీ జరిగింది. రైలులోని ఎస్‌2, ఎస్‌4, ఎస్‌6, ఎస్‌7, ఎస్‌8 బోగీల్లో అందినకాడికి దోచుకెళ్లారు.

ఆతర్వాత సికింద్రాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. ఎస్‌1, ఎస్‌2 బోగీల్లో దొంగతనం చేశారు. అర్ధరాత్రి 1.20 నుంచి 1.50 గంటల మధ్య దోపిడీ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు వెళ్లడించారు. ప్రయాణికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి పోలీసులు తెలిపారు.

Latest News

More Articles