సంగారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఝరాసంగం (మం) పొట్ పల్లిలో పతంగి ఎగరవేస్తూ కరెంట్ షాక్ తో శివకుమార్(22) అనే యువకుడు మృతి చెందాడు. విద్యుత్ తీగలకు ఇరుక్కున్న గాలిపటం తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ ఘాతంతో చేతులు, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించేలోగా యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు.