Thursday, May 2, 2024

భారత్ vs న్యూజిలాండ్: ‘స్టార్మ్‌ఛేజర్’ విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ చీర్స్ 

spot_img

క్రికెట్ వరల్డ్ కప్‌లో  2019 సెమీ-ఫైనల్స్‌లో జరిగిన ఓటమికి న్యూజిలాండ్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది.

Also Read.. తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..!

ఈ మ్యాచులో 95 పరుగులు చేసిన తన భర్త విరాట్ కోహ్లీని నటి అనుష్క శర్మ ఉత్సాహపరిచింది.  ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మ్యాచ్ వీడియోలు, ఫోటోలను షేర్ చేసింది. ఫీల్డ్‌లో ఉన్న విరాట్ పోటోను పోస్ట్ చేసి.. “మీ గురించి ఎల్లప్పుడూ గర్వంగా ఉంటుంది” అనే క్యాప్షన్‌ ఇచ్చి అతని పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.

Also Read.. మహిళలకు ఇస్రో శుభవార్త: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో అధిక ప్రాధాన్యం

న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి, ప్రపంచ కప్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. కోహ్లీ 105 బంతుల్లో 95 పరుగులు చేసి అసాధారణ ప్రదర్శన చేశాడు. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. న్యూజిలాండ్‌ను నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు కట్టడి చేసింది. మరోవైపు అనుష్క – విరాట్ జంట తమ రెండవ బిడ్డను స్వాగతించబోతున్నారని వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. అనుష్క నటించిన ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ విడుదల కానుంది.

Latest News

More Articles