బాలకృష్ణ, రవితేజ ఇద్దరు ఇద్దరే. వీరి సినిమాలు వస్తున్నాయంటే.. అభిమానుకలు పూనకాలే. ఇప్పటికే ఎనిమిది సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డ ఈ స్టార్స్.. మరోసారి దసరా వార్కి రెడీ అవుతున్నారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ తో రవితేజ అభిమానులకు పిచ్చేక్కించేందుకు వస్తున్నాడు. అక్టోబర్ 20న రిలీజ్కి రెడీ అవుతోంది టైగర్ నాగేశ్వరరావు. 2023ని వాల్తేరు వీరయ్యతో బోణీ కొట్టారు రవితేజ. ఆ తర్వాత వచ్చిన రావణాసుర మాత్రం ఫ్లాప్ తెచ్చిపెట్టింది. అందుకే టైగర్ నాగేశ్వరరావుతో విజయం సాధించాల్సిందేననే పట్టుమీదున్నారు రవితేజ.
మరోవైపు అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ సినిమాతో సై అంటూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయుధ పూజతో గీసారి దసరా జోర్దారుంటది అని విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్. డోంట్ కేర్ అనే ట్యాగ్లైన్తో దూసుకురావడానికి రెడీ అవుతున్నారు బాలయ్య.
ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ స్టార్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో పోటీ పడ్డారు. ఇంతకు ముందు రవితేజ దేవుడు చేసిన మనుషులు, బాలయ్య శ్రీమన్నారాయణ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రవితేజ దరువు, బాలయ్య అధినాయకుడు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యాయి. బాలయ్య పరమవీరచక్ర, రవితేజ మిరపకాయ్ విడుదలైంది.