కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవాళ (శనివారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. పాత పార్లమెంట్ బిల్డింగ్ చరిత్రాత్మకమైనది. కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని రేపు (ఆదివారం) ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు.. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత ఎందుకు ప్రారంభింపజేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి.20కి పైగా పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.