పెద్దపల్లి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపారనీ ధర్మారంకు చెందిన 9 మంది యువకులను ధర్మారం ఎస్సై సత్యనారాయణ చిత్ర హింసలు పెట్టాడు. ఎస్సై తీరుకు నిరసనగా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ ప్రోత్సాహంతోనే ఎస్సై తమను తీవ్రంగా కొట్టారని యువకులు ఆరోపించారు. ఫ్లెక్సీలు తాము చింపకున్నా వేధిస్తున్నారని వాపోయారు. ఒకవేళ చింపిన కూడా చట్ట పరంగా శిక్షించాలి కానీ ఇలా తీవ్రంగా కొట్టడమెంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read.. రహదారిపై దగ్ధమైన కారు.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!