స్పామ్ కాల్స్, జంక్ మెసేజ్లు, ఫ్రాండ్ మెసేజ్లతో విసిగెత్తి పోయారా? అయితే.. మీకోసం..కేంద్రం ఓ కొత్త పోర్టల్ని తీసుకొచ్చింది. దీని పేరు చక్షు పోర్టల్. అనుమానిత ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లను ఇందులో రిపోర్టు చేయవచ్చు. గడిచిన 30 రోజుల్లో ఏదైనా స్పామ్ కాల్- మెసేజ్ అందితే.. దానిని పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు.
టెలికాం వసతులను దుర్వినియోగం చేయకుండా చూసుకునేందుకు.. బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలతో కోఆర్డినేట్ చేసేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ (డీఐపీ)ని లాంచ్ చేసింది భారత ప్రభుత్వం. భారత ప్రజలు.. ఫ్రాడ్ సమాచారాన్ని రిపోర్టు చేయవచ్చు. అది ఫోన్ కాల్ అయినా, ఎస్ఎంఎస్ అయినా, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ అయినా పర్లేదు. ఫిర్యాదు అందిన తర్వాత.. డీఐపీ ప్లాట్ఫామ్.. రీ- వెరిపికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. రీ- వెరిఫికేషన్లో తప్పులు బయటపడితే.. ఆ నెంబర్ ఇక డిస్కంటిన్యూ అయిపోతుంది
సంచార్ సాతి వెబ్సైట్లో.. ఈ చక్షు పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్లో అంది ఫ్రాడ్ కమ్యూనికేషన్ని రిపోర్ట్ చేయవచ్చు.సెక్స్టార్షన్ కేసులకు ఈ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. కొందరు.. ప్రభుత్వ అధికారులం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ వివరాలను అడుగుతున్నారు. అలాంటి కేసులను కూడా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
sancharsaathi.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి, కిందకి స్క్రోల్ చేసి సిటిజెన్ సెంట్రిక్ సర్వీసెస్పై క్లిక్ చేయండి. తర్వాత చక్షు పోర్టల్ ఆప్షన్ని ఎంచుకోండి. ఫ్రాడ్ కాల్, మెసేజ్లను ఫిర్యాదు చేసేందుకు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సంబంధిత కాల్, మెసేజ్ డేటాను షేర్ చేయాలని మీకు కనిపిస్తుంది. ఫ్రాడ్ కేటగిరీని సెలక్ట్ చేసుకోండి. సంబంధిత స్క్రీన్షాట్ని అప్లోడ్ చేయండి. ఫ్రాడ్కు పాల్పడిన అనుమానిత మొబైల్ నెంబర్, డేట్- టైమ్ వంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆతర్వాత మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఓటీపీ వంటి వివరాలను ఫిల్ చేయాలి. దీంతో మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. అనంతరంసంబంధిత నెంబర్ పై రీ- వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇది కూడా చదవండి:తెలంగాణ నుంచి తరలిపోతున్న కంపెనీలు.. కేటీఆర్ ఆవేదన