Sunday, April 28, 2024

సూర్యాపేటలో బీఆర్ఎస్ జోరు.. కాంగ్రెస్, బీజేపీల బేజారు

spot_img

సూర్యపేట జిల్లా: దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని , సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం అన్నారు. బీఆర్ఎస్ కి  మద్దతుగా నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ , బిజెపిలే దీనికి నిదర్శనం అన్నారు.

Also Read.. 27 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్స్.. అదిరిపోయే ఆఫర్లు

దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ బిజెపి లతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. జరుగుతున్న అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా  భాగస్వామ్యం కావాలి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అందరూ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్న దళిత మోర్చా నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు.

Also Read.. విజయ్‌ సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల

సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ హోరుకు కాంగ్రెస్, బిజెపిలు బేజారవుతున్నాయి. తాజాగా అభివృద్ధికి ఆకర్షితులై  చివ్వెంల మండలం  కాశింపేట కు చెందిన బిజెపి దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలతో పాటు, 216  మంది కాంగ్రెస్ నాయకులు హైదరాబాధ్ లోని మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి గులాబీ కండువాకప్పి సాదర స్వాగతం పలికారు.

Latest News

More Articles