బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు.
పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెప్ పార్టీ నాయకులు మాయమాటలతో ఓట్ల కోసం వస్తున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్లీ కాగ్రెస్ పార్టీకి ఓటెస్తే కరెంట్ కోతలతో రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.