Saturday, May 11, 2024

20వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవం.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

spot_img

సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్‌లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న 20వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్త విజయానంద తీర్థ స్వామీజీని ఆమె దర్శించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం చాతుర్మాస్య వ్రత దీక్షలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొని గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతత లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆర్‌సీ పురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ పాల్గొన్నారు.

Latest News

More Articles